గర్భిణులకు మధుమేహం వస్తే....
ABN , First Publish Date - 2020-10-17T20:43:46+05:30 IST
గర్భం దాల్చిన మహిళలలో కొందరికి నాలగో నెల దాటిన తరువాత శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల రక్తంలో చక్కర శాతాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఈ రకమైన మధుమే
ఆంధ్రజ్యోతి(06-10-2020)
ప్రశ్న: గర్భిణులలో వచ్చే మధుమేహానికి ఎటువంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి?
-విజయలక్ష్మి, ఆదిలాబాద్
డాక్టర్ సమాధానం: గర్భం దాల్చిన మహిళలలో కొందరికి నాలగో నెల దాటిన తరువాత శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల రక్తంలో చక్కర శాతాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఈ రకమైన మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. సమతుల, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. పిండి పదార్థాలను మితంగా తీసుకోవాలి కానీ పూర్తిగా మానేయకూడదు. రక్తంలో గ్లూకోజు హెచ్చుతగ్గులు లేకుండా ఉండడానికి కొద్ది పాటి ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. ఉదయం అల్పాహారం తరువాత రెండు గంటలకు కొద్దిగా పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం కూడా బాదం, ఆక్రోట్ లాంటి గింజలు, ఉడికించిన సెనగలు, మజ్జిగ తీసుకో వచ్చు. రాత్రి భోజనం తొందరగా చేసి నిద్రపోయే ముందు ఓ కప్పు పాలు తాగండి. స్వీట్లు చక్కెర లేదా బెల్లంతో చేసినవైనా పూర్తిగా మానెయ్యాలి. భోజనంలో అన్నం కంటే కూరలు, పప్పే ఎక్కువగా తీసుకోవాలి. ఆహార జాగ్రత్తలతో పాటు వైద్యుల సలహామేరకు ఉదయం, సాయంత్రం కూడా కొద్దిపాటి నడక తప్పనిసరి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)