కరోనా అని తెలిసి.. కుటుంబంతో సహా పరారీ యత్నం!
ABN , First Publish Date - 2020-06-22T00:52:36+05:30 IST
ప్రపంచం మొత్తాన్నీ కరోనా మహమ్మారి వణికిస్తోంది. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు ప్రజలు.
![కరోనా అని తెలిసి.. కుటుంబంతో సహా పరారీ యత్నం!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062107185013/06212020192226n5.jpg)
లక్నో: ప్రపంచం మొత్తాన్నీ కరోనా మహమ్మారి వణికిస్తోంది. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో కరోనా వచ్చిందని తెలిసి, ఆస్పత్రికి వెళ్లకుండా కుటుంబంతోసహా పరారయ్యే ప్రయత్నం చేశాడో యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయీలో చోటుచేసుకుంది. స్థానికంగా జరుగుతున్న ఓ వివాహంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి వచ్చిందో కుటుంబం. ఆ కుటుంబంలోని 18ఏళ్ల యువకుడికి కరోనా వచ్చింది. ఈ విషయం తెలియగానే సదరు యువకుడు, అతని కుటుంబం హర్దోయీ నుంచి పరారయ్యే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. వీరితో కాంటాక్ట్లోకి వచ్చిన దాదాపు 40 కుటుంబాలను హోంక్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు.