కరోనా ఎఫెక్ట్: యోగి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-03-25T23:38:35+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం..

కరోనా ఎఫెక్ట్: యోగి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

లక్నో: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టే చర్యల్లో  భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాన్ మసాలా తయారీ, అమ్మకంపై పూర్తి నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో దీన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. యూపీలో ఇప్పటికే  ఓ విదేశీయుడు సహా 35 మందికి కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. కాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం ప్రకారం.. బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 562కు చేరుకుంది.

Updated Date - 2020-03-25T23:38:35+05:30 IST