జూలై 1న అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం యోగి..!

ABN , First Publish Date - 2020-06-16T22:19:01+05:30 IST

లాక్ డౌన్ నిబంధనల్లో భారీగా సడలింపులు ఇవ్వడండో అయోధ్య రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే 70 ఎకరాల్లో భూమిని చదును చేయడం పూర్తయింది. కోర్టు తీర్పుతో

జూలై 1న అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం యోగి..!

లక్నో: లాక్ డౌన్ నిబంధనల్లో భారీగా సడలింపులు ఇవ్వడండో అయోధ్య రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే 70 ఎకరాల్లో భూమిని చదును చేయడం పూర్తయింది. కోర్టు తీర్పుతో రెట్టించిన ఉత్సాహంతో పనులు జరుగుతుండగా.. ప్రతిపాదిత అయోధ్య రామ మందిర భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న అయోధ్య రామ మందిరానికి భూమి పూజను నిర్వహించేందుకు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.. 


కాగా.. భూమి పూజకు రావాలంటూ ట్రస్ట్ సభ్యులు ప్రధాని మోదీకి ఫిబ్రవరి నెలలోనే ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ.. ఈ కార్యక్రమానికి హాజరవుతారా..? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిద్యతాథ్ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలోనే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఓ పునాది రాయిని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిష్రా ద్వారా అయోధ్యకు పంపిస్తారు. అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఆయన  భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. 

Updated Date - 2020-06-16T22:19:01+05:30 IST