గాంధీలు ఎందుకు మౌనంగా ఉన్నారు?: స్మృతీ ఫైర్

ABN , First Publish Date - 2020-10-20T01:52:18+05:30 IST

మద్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఇలా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి కాదు. ఓ మహిళా కార్యకర్తను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరు మర్చిపోతారు

గాంధీలు ఎందుకు మౌనంగా ఉన్నారు?: స్మృతీ ఫైర్

న్యూఢిల్లీ: బీజేపీ నేత ఇమర్తి దేవిపై కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా గాంధీ కుటుంబం మౌనంగా ఉండడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇమర్తి దేవిపై కమల్‌నాథ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళా రాజకీయ వేత్తపై ఇలాంటి వ్యాఖ్యలు ఎంత వరకు సమర్ధనీయం? అయితే ఇక్కడ నాకో విషయం అర్థం కాలేదు. ఇంత జరుగుతున్నా గాంధీ కుటుంబం నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు’’ అని స్మృతి అన్నారు.


‘‘మద్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఇలా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి కాదు. ఓ మహిళా కార్యకర్తను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరు మర్చిపోతారు? ఇప్పుడు కమల్‌నాథ్ కూడా అలాగే వ్యవహరించారు. ఆమె నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగింది. గాంధీ కుంటుంబానికి మహిళలపై ఏమాత్రం గౌరవమున్నా కమల్‌నాథ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి. అయితే ఇది జరక్కపోవచ్చు. ఇలాంటి వాళ్లు కాంగ్రెస్ నుంచే పుట్టుకొస్తారు’’ అని స్మృతి అన్నారు.

Updated Date - 2020-10-20T01:52:18+05:30 IST