బెంగాల్ లో కొత్తగా 986 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-07-09T02:39:57+05:30 IST
బెంగాల్ లో కొత్తగా 986 కరోనా కేసులు నమోదు

కోల్ కతా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు కొత్తగా రాష్ట్రంలో 986 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 24,823 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇవాళ 23 మంది మృతి చెందగా, మొత్తం 827 మంది చనిపోయినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 7,705 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.