అవకతవకల సమాచారన్ని ప్రభుత్వం దాస్తోంది : గవర్నర్ ధన్కర్
ABN , First Publish Date - 2020-08-03T17:16:51+05:30 IST
రాజకీయ హింస, ఆంఫాన్ తుఫానులో జరిగిన అవకతవకల సమాచారాన్ని మమత నేతృత్వంలోని ప్రభుత్వం
కోల్కతా : రాజకీయ హింస, ఆంఫాన్ తుఫానులో జరిగిన అవకతవకల సమాచారాన్ని మమత నేతృత్వంలోని ప్రభుత్వం దాచేస్తోందని గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆరోపించారు. ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. అస్పష్టత మరింత అవినీతికి దారి తీస్తుందని గవర్నర్ ధన్కర్ చురకలంటించారు. అయితే గవర్నర్ వ్యాఖ్యలపై అధికార టీఎంసీ కౌంటర్ ఇచ్చింది. గవర్నర్ తమ పరిధిని తెలుసుకుంటే బాగుంటుందని ఎంపీ కల్యాణ్ బెనర్జీ చురకలంటించారు. రాష్ట్రంలో ఆయన బీజేపీ వ్యక్తిగా, పార్టీ వాయిస్ వినిపించే వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని కల్యాణ్ సింగ్ మండిపడ్డారు.