ఢిల్లీలో 45చోట్ల గెలుపు మాదే: బీజేపీ ఎంపీ పర్వేశ్

ABN , First Publish Date - 2020-02-08T16:23:53+05:30 IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 45 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎంపీ పర్వేశ్ వర్మ పేర్కొన్నారు. ..

ఢిల్లీలో 45చోట్ల గెలుపు మాదే: బీజేపీ ఎంపీ పర్వేశ్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 45 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎంపీ పర్వేశ్ వర్మ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మాటియాలా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని నేను ఆశిస్తున్నాను. గత అనేక సంవత్సరాలుగా ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి ఆధారంగా ఓట్లు వేయాలని నేను ఢిల్లీ ప్రజలను కోరుతున్నాను. ఢిల్లీలో మేము 45 స్థానాలకు పైగా గెలుచుకుంటాం...’’ అని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 70 స్థానాలకు గానూ ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 

Updated Date - 2020-02-08T16:23:53+05:30 IST