యూపీలోనూ పోటీచేస్తాం: ఒవైసీ
ABN , First Publish Date - 2020-12-17T08:06:43+05:30 IST
ఉత్తరప్రదేశ్లో 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

లఖ్నవూ, డిసెంబరు 16: ఉత్తరప్రదేశ్లో 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఇప్పటికే బిహార్లో విజయవంతంగా జెండా ఎగరేసి- వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపాలని నిశ్చయించిన మజ్లిస్ - యూపీలో ఓం ప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ బహుజన్ సమాజ్ పార్టీ(ఎ్సబీఎ్సపీ)తో కలిసి పోటీలోకి దిగనుంది.