ఇటలీ నుంచి నేర్చుకోకపోవడం సిగ్గుచేటు.. స్టార్ సింగర్ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-03-29T02:54:13+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా కొందరు బుద్ధిలేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటలీ నుంచి నేర్చుకోకపోవడం సిగ్గుచేటు.. స్టార్ సింగర్ ఆగ్రహం

ముంబై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా కొందరు బుద్ధిలేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటలీని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలని,  అలా చేయకుండా మూర్ఖంగా ప్రవర్తించడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'లాక్ డౌన్ విధించినా కూడా కొందరు మార్నింగ్ వాకులు, జాగింగ్ చేస్తున్నారని మా నాన్న చెప్పారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం' అని సోనూ నిగమ్ వ్యాఖ్యానించారు. కాగా, భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే 900 దాటాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితులను సీరియస్ గా తీసుకోకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించొద్దని ఆయన ప్రజలను కోరారు.

Updated Date - 2020-03-29T02:54:13+05:30 IST