మూలనున్న శవాల గుట్టల్ని పట్టించుకోవద్దని చెప్పలేం కదా: బిల్ గేట్స్

ABN , First Publish Date - 2020-03-25T21:25:37+05:30 IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో ఏకభవించని వారి జాబితాలోకి తాజాగా అపర కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వచ్చిచేరారు.

మూలనున్న శవాల గుట్టల్ని పట్టించుకోవద్దని చెప్పలేం కదా: బిల్ గేట్స్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో ఏకభవించని వారి జాబితాలోకి తాజాగా అపర కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వచ్చిచేరారు. అమెరికా ప్రస్తుతం 15 రోజుల పాటు ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కఠిన నిబంధనలు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఓ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. వీలైనంత త్వరగా ప్రజలు పనుల్లోకి దిగాలని సూచించారు. దీనిపై శాస్త్రవేత్తల నుంచి వ్యాపారవేత్తల వరకూ అనేక మంది మండిపడుతున్నారు. తాజాగా బిల్ గేట్స్ కూడా తన అభిప్రాయాల్ని సూటిగా వ్యక్తం చేశారు.  


‘అంతా అనుకున్నట్టు జరిగితేనే  6 నుంచి 10 వారాల్లో పరిస్థితి కుదుట పడుతుంది. ఓ పక్క పేరుకుంటున్న శవాల గుట్టల్ని పట్టించుకోకుండా సాధారణ పరిస్థితికి వెళ్లలేం కదా. అసలు ఈ పరిస్థితిల్లో.. మామూలుగా పనుల్లోకి దిగండని ప్రజలను కోరడం చాలా కష్టం. రెస్టారంట్లను తెరిచిపెట్టండి..ఇళ్లు కొనుక్కోండి..పక్కన పేరుకుంటున్న శవాల గుట్టలను మాత్రం పట్టించుకోకండి. వీలైనంతా కర్చు పెట్టండి.. జీడీపీ వృద్ధి రేటే అన్నికంటే ముఖ్యమని ఓ రాజకీయ నాయకుడు భావించాడు కాబట్టి మీరు ఇవ్వన్నీ చేయాలని ప్రజలు చెప్పలేం కదా? ఆర్థిక వ్యవస్థను తిరిగి నిర్మించుకోగలం కానీ పోయిన వారిని తిరిగి తెచ్చుకోలేం’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2020-03-25T21:25:37+05:30 IST