రాజకీయ పార్టీల పట్ల మాకు పక్షపాతం లేదు

ABN , First Publish Date - 2020-09-21T07:27:04+05:30 IST

ఫేస్‌బుక్‌(ఎఫ్‌బీ) తటస్థంగా ఉంటుందని, రాజకీయ పార్టీల పట్ల ఎలాంటి పక్షపాతం లేదని ఆ సంస్థ భారత విభాగం చీఫ్‌ అజిత్‌ మోహన్‌ వెల్లడించారు...

రాజకీయ పార్టీల పట్ల మాకు పక్షపాతం లేదు

  • ఫేస్‌బుక్‌ ఇండియా చీఫ్‌ అజిత్‌ మోహన్‌ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ఫేస్‌బుక్‌(ఎఫ్‌బీ) తటస్థంగా ఉంటుందని, రాజకీయ పార్టీల పట్ల ఎలాంటి పక్షపాతం లేదని ఆ సంస్థ భారత విభాగం చీఫ్‌ అజిత్‌ మోహన్‌ వెల్లడించారు. బీజేపీ నేతల విద్వేషపూరిత పోస్టులను ఎఫ్‌బీ చూసీచూడనట్లు వదిలేస్తుందంటూ గత నెల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఓ సంచలన కథనం ప్రచురితమవ్వడం.. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ పోస్టులను అందులో ఉదాహరణగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కథనం రాజకీయ దుమారాన్ని లేపింది.


తొలి నుంచి ఎఫ్‌బీ ఏ పార్టీ పట్ల అనుకూలంగా లేదా ప్రతికూలంగా గానీ లేదని అజిత్‌మోహన్‌ గుర్తు చేశారు. కా గా.. ఫేస్‌బుక్‌కు ఢిల్లీ అసెంబ్లీ శాంతి భద్రతల కమి టీ ఫైనల్‌ నోటీసు పంపింది. బుధవారంలోగా విచారణకు రావాలని అజిత్‌మోహన్‌ను ఆదేశించింది. 

Updated Date - 2020-09-21T07:27:04+05:30 IST