దూబే ఎన్‌కౌంటర్: నిలకడగా పోలీసుల ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-07-10T20:22:43+05:30 IST

కాన్పూర్ ఎన్‌కౌంటర్ నిందితుడు వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ముగ్గురు పోలీసుల ఆరోగ్య పరిస్థితి..

దూబే ఎన్‌కౌంటర్: నిలకడగా పోలీసుల ఆరోగ్యం

కాన్పూర్: కాన్పూర్ ఎన్‌కౌంటర్ నిందితుడు వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ముగ్గురు పోలీసుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఎల్ఎల్ఆర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌బీ కమల్ శుక్రవారంనాడు తెలిపారు. కానిస్టేబుళ్ల ఒంట్లో నుంచి బుల్లెట్లు తీసేసినట్టు ఆయన మీడియాకు తెలిపారు. శుక్రవారం ఉదయం  వికాస్ దూబే తప్పించుకునే ప్రయత్నంలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కాల్చిచంపింది. అతని ఛాతీలో మూడు బుల్లెట్లు దిగగా, ఒకటి చేతిలో దిగింది. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో నాలుగో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డాడు.


వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో నలుగురు పోలీసులు గాయపడినట్టు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ఆరు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న దూబే గురువారం ఉదయం ఉజ్జయినిలో ప్రార్థనలకు వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డు గుర్తించడంతో అతన్ని అరెస్టు చేసారు. బిక్రూ గ్రామంలో గత వారంలో దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందడం సంచలనమైంది.

Updated Date - 2020-07-10T20:22:43+05:30 IST