కోవిడ్‌-19పై ఫేక్‌న్యూస్ షేర్ చేస్తే.. భారీ జరిమానా..

ABN , First Publish Date - 2020-04-15T22:19:15+05:30 IST

కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందకు యావత్ ప్రపంచదేశాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఓవైపు రోజురోజుకీ.. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంటే..

కోవిడ్‌-19పై ఫేక్‌న్యూస్ షేర్ చేస్తే.. భారీ జరిమానా..

హనోయ్: కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందకు యావత్ ప్రపంచదేశాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఓవైపు రోజురోజుకీ.. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంటే.. మరోవైపు కొందరు వ్యక్తులు బాధ్యత లేకుండా కోవిడ్-19 గురించి పుకార్లు పుట్టిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు వియత్నాం ప్రభుత్వం సిద్ధమైంది. 


కోవిడ్-19పై తప్పుడు ప్రచారం చేసే వారికి రూ.32వేల నుంచి రూ.65వేల వరకూ జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ప్రజలకు అన్‌లైన్‌లో ఉండే స్వేచ్ఛను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆ సంస్థ పేర్కొంది. 

Updated Date - 2020-04-15T22:19:15+05:30 IST