బుద్ధుడి మార్గం చిరస్మరణీయం: ఉపరాష్ట్రపతి
ABN , First Publish Date - 2020-05-07T22:57:13+05:30 IST
దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస, భూతదయ వంటి బోధనల ద్వారా సర్వమానవాళికి గౌతమబుద్ధుడు చేసిన మార్గదర్శనం చిరస్మరణీయమని ట్విట్టర్లో పేర్కొన్నారు. శాంతితోనే ఆనందం పొందవచ్చని తథాగతుడు చూపిన మార్గాన్ని.. నేటి సమాజం అనుసరిస్తుందని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.