చారిత్రక ఘటనలపై అధ్యయనం: వెంకయ్య
ABN , First Publish Date - 2020-08-13T07:04:49+05:30 IST
చారిత్రక ఘటనలపై విస్తృత అధ్యయనం జరిపి, కీలకాంశాలను ముందుతరాలకు అందించాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంక య్య నాయుడు అభిప్రాయపడ్డారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): చారిత్రక ఘటనలపై విస్తృత అధ్యయనం జరిపి, కీలకాంశాలను ముందుతరాలకు అందించాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంక య్య నాయుడు అభిప్రాయపడ్డారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ట్రస్టు సభ్యుడు కళ్యాణ్కుమార్ రచించిన ‘నేతాజీ-ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ బ్రిటిష్ అర్కైవ్స్’ పుస్తకాన్ని బుధవారం ఆయన ఢిల్లీలో ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల శౌర్య గాథలను పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు.