ఉత్తరాఖండ్ లో కొత్తగా 24 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-05-28T21:46:26+05:30 IST

ఉత్తరాఖండ్ లో కొత్తగా 24 కరోనా కేసులు నమోదు

ఉత్తరాఖండ్ లో కొత్తగా 24 కరోనా కేసులు నమోదు

డెహ్రాడూన్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం మధ్యాహ్నానికి అందిన సమాచారం మేరకు కొత్తగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 24 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 493 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 407 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య శాఖ తెలిపింది. సాయంత్రం విడుదల చేయనున్న హెల్త్  బులెటిన్ లో  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-05-28T21:46:26+05:30 IST