యూపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ రోజు 570కి పైగా..

ABN , First Publish Date - 2020-06-24T02:32:33+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 570కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 19వేలకు...

యూపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ రోజు 570కి పైగా..

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 570కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 19వేలకు చేరువైంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 576 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 19 మంది మరణించారు. 515 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,893కి చేరింది. వీరిలో 6,189మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 12,116మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 588మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-24T02:32:33+05:30 IST