కస్టమర్లకు షాక్ ఇచ్చిన షియోమి
ABN , First Publish Date - 2020-12-27T23:05:28+05:30 IST
కస్టమర్లకు షాక్ ఇచ్చిన షియోమి

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. త్వరలో విడుదల చేయనున్న ఎంఐ 11 స్మార్ట్ఫోన్లకు ఛార్జర్లను అందించడం లేదని షియోమి సీఈవో లీ జున్ పేర్కొన్నారు.
రాబోయే ఎంఐ 11 స్మార్ట్ఫోన్ రిటైల్ బాక్స్లో కంపెనీ ఛార్జర్ను ప్యాక్ చేయదని షియోమి సీఈఓ వెల్లడించారు. ఇంతకుముందు షియోమి సంస్థ ఆపిల్ సంస్థను ఉద్దేశించి మాట్లాడుతూ ఐఫోన్ 12 సిరీస్తో ఛార్జర్లను చేర్చలేదని తెలిపింది.