మా వాళ్లకు మళ్లీ ఉద్యోగాలివ్వండి

ABN , First Publish Date - 2020-12-07T08:13:29+05:30 IST

కొవిడ్‌ వల్ల గల్ఫ్‌ దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయులకు మళ్లీ ఉపాధి కల్పించాలని మోదీ సర్కారు కోరనుంది. ప్రవాస భారతీయులకు తాజాగా వర్క్‌ వీసాలు మంజూరు చేయాలని కోరేందుకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్...

మా వాళ్లకు మళ్లీ ఉద్యోగాలివ్వండి

  • గల్ఫ్‌ దేశాలను కోరేందుకు  కేంద్ర మంత్రుల పర్యటన


న్యూఢిల్లీ, డిసెంబరు 6: కొవిడ్‌ వల్ల గల్ఫ్‌ దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయులకు మళ్లీ ఉపాధి కల్పించాలని మోదీ సర్కారు కోరనుంది. ప్రవాస భారతీయులకు తాజాగా వర్క్‌ వీసాలు మంజూరు చేయాలని కోరేందుకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ నెలాఖరులో ఖతర్‌, కువైట్‌లో పర్యటించనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ఒమన్‌లో పర్యటిస్తారు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే కూడా సౌదీ అరేబియా, యూఏఈల్లో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విదేశాలకు వలస వెళ్లిన భారతీయుల్లో 70ుకి పైగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, బహ్రెయిన్‌లోనే నివసిస్తున్నారు.

Updated Date - 2020-12-07T08:13:29+05:30 IST