ఐసీయూలో బ్రిటన్ ప్రధాని! తాజా అప్డేట్ ఏంటంటే..
ABN , First Publish Date - 2020-04-08T23:06:31+05:30 IST
కరోనా వైరస్తో పోరాడుతూ ఐసీయూలో చికిత్స బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(55) ఆరోగ్యం నిలకడగా ఉంది.

లండన్: కరోనా వైరస్తో పోరాడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(55) ఆరోగ్యం నిలకడగా ఉంది. ఉపిరి తీసుకోవడంలో సహాయ పడేందుకు ఆక్సిజన్ అందిస్తుండటంతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ప్రభుత్వ కార్యకలాపాలను ఫారిన్ సెక్రెటరీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
బ్రిటన్ ప్రధానికి కరోనా వైరస్ సోకిందన్న విషయం వారం రోజుల క్రితం వెల్లడైంది. కాగా.. కొద్ది రోజులుగా ఆయనలో జ్వర తీవ్రత, దగ్గు ఎక్కువగా ఉండటంతో ఆదివారం సాయంత్రం బోరిస్ను సెయింట్ థామస్ ఆసుపత్రికి తరలించారు. అయితే సోమవారం నాడు పరిస్థితి కాస్తంత ఆందోళనకరంగా మారటంతో డాక్టర్లు వెంటనే ఆయన్ను ఐసీయూ ఉంచి చికిత్సనివ్వడం ప్రారంభించారు. అయిటే ఐసీయూలో ఆయన వెంటిలైటర్పై ఉన్నరనే వార్తను ఫారిన్ సెక్రరెటరీ డామినిక్ రాబ్ కొట్టిపారేశారు. ప్రధానికి సులువుగా ఆక్సీజన్ తీసుకునే ఏర్పాటు మాత్రమే చేశామని స్పష్టం చేశారు.