పిడుగుల కారణంగా 22 మంది మృతి...
ABN , First Publish Date - 2020-06-26T00:17:38+05:30 IST
బీహార్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో... గురువారం పడిన పిడుగుల కారణంగా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఉన్నారు. బీహార్ లో కురుస్తోన్న భారీ వర్షాల నేపధ్యంలో గడిచిన 24 గంటల్లో పిడుగు ‘పోట్లు’ చోటుచేసుకున్నాయి. మృతుల వివరాలను బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ గురువారం విడుదల చేసింది.

పట్నా : బీహార్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో... గురువారం పడిన పిడుగుల కారణంగా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఉన్నారు. బీహార్ లో కురుస్తోన్న భారీ వర్షాల నేపధ్యంలో గడిచిన 24 గంటల్లో పిడుగు ‘పోట్లు’ చోటుచేసుకున్నాయి. మృతుల వివరాలను బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ గురువారం విడుదల చేసింది.