12 మంది ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులకు కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-05-09T10:38:07+05:30 IST

దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కేంద్ర పారామిలటరీ బలగాలను వీడటం లేదు.....

12 మంది ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులకు కరోనా వైరస్

న్యూఢిల్లీ : దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కేంద్ర పారామిలటరీ బలగాలను వీడటం లేదు. కొత్తగా 12 మంది ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులకు(ఐటీబీపీ) కూడా కరోనా వైరస్ సోకడం కలవరం రేపింది. కరోనా సోకిన నలుగురు ఐటీబీపీ జవాన్లను జాజ్జార్ లోని ఎయిమ్స్ లో మరో ఇద్దరు జవాన్లను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. గతంలో 88 మంది ఐటీబీపీ జవాన్లకు కరోనా సోకడంతో వారిని గ్రేటర్ నోయిడాలోని కొవిడ్ ఆసుపత్రిలో చేర్చారు. కేంద్రపారామిలటరీ బలగాలకు చెందిన ఐటీబీపీతోపాటు బీఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. పారామిలటరీ దళాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమాయత్తమైంది. 


Updated Date - 2020-05-09T10:38:07+05:30 IST