వారికి తెలియడంలేదు : ట్రంప్
ABN , First Publish Date - 2020-09-20T23:53:53+05:30 IST
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం నేపధ్యంలో హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను బందిపోట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా వారు విడిచిపెట్ట లేదని ఆక్షేపించారు.

మిన్నేసోటా : నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం నేపధ్యంలో హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను బందిపోట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా వారు విడిచిపెట్ట లేదని ఆక్షేపించారు.
శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ చొవిన్... ఈ ఏడాది మే 25న జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడి మెడపై మోకాలితో తొక్కిపట్టడంతో ఉపిరాడక ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే. ఓ వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అమెరికాలో ఉద్వమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో ట్రంప్ మాట్లాడారు.
ఆందోళనకారులనుద్దేశించి... ‘వారు అబ్రహం లింకన్ విగ్రహాన్ని కూల్చివేశారు. గాంధీ విగ్రహహాన్ని ధ్వంసం చేశారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియలేదు. మన గత చరిత్రను వారు ధ్వంసం చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత కాలం అమెరికా చరిత్రను వారేమీ చేయలేరు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారికి పదేళ్ళ జైలు శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. దీంతో విగ్రహాల విధ్వంసం ఆగిపోయిందన్నారు. కాగా... కూల్చివేతకు గురైన గాంధీ విగ్రహాన్ని భారత ఎంబసీ సాయంతో మళ్ళీ నిర్మించినట్లు ట్రంప్ వెల్లడించారు.