మీడియాలోని వార్త తప్పు, పాఠ్యాంశాలను తొలగించలేదు: సీబీఎస్సీ
ABN , First Publish Date - 2020-07-09T04:47:26+05:30 IST
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకెడరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ).. 9 నుంచి 12 తరగతుల్లోని పాఠాలను కుదించడంపై విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సీబీఎస్సీ తాజాగా ప్రయత్నించింది.

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకెడరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ).. 9 నుంచి 12 తరగతుల్లోని పాఠాలను కుదించడంపై విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సీబీఎస్సీ తాజాగా ప్రయత్నించింది. సిలబస్ కుదింపులో భాగంగా పాఠ్యాంశాలు తొలగించామన్న వార్త అవాస్తమని, మీడియాలో తప్పుగా అచ్చైందని స్పష్టం చేసింది. ఆయా పాఠ్యాంశాలను తొలగించలేదని, ప్రత్యామ్నాయ అకాడమిక్ కాలెండర్లో చేర్చామని తెలిపింది. ఈ ప్రళాలిక ఇప్పటికే సీబీఎస్సీ అనుబంధ పాఠశాలల్లో అమలవుతోందని తెలిపింది. వీటిని టీచర్లు విద్యార్థులకు బోధిస్తారని అయితే వీటిపై పరీక్షలు మాత్రం ఉండవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.