మద్యం వద్దని హైకోర్టంటే, సుప్రీంకు ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-05-09T20:58:24+05:30 IST

కరోనా విజృంభన నేపథ్యంలో మద్యం అమ్మకాలు తెరవడంపై తమిళనాడు ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి, లాక్‌డౌన్ ఎత్తివేసేంత వరకు మద్యం దుకాణాలను మూసివేయాలంటూ

మద్యం వద్దని హైకోర్టంటే, సుప్రీంకు ప్రభుత్వం

చెన్నై: కరోనా విజృంభన నేపథ్యంలో మద్యం అమ్మకాలు తెరవడంపై తమిళనాడు ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి, లాక్‌డౌన్ ఎత్తివేసేంత వరకు మద్యం దుకాణాలను మూసివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. హోం డెలివరీ మాత్రం చేసుకోవచ్చని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై పళనిస్వామి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండు దఫాలు లాక్‌డౌన్ ముగిశాక, మూడో దఫా లాక్‌డౌన్ ప్రకటన చేస్తూ మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగానే అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. కేంద్రం సూచనలు తూచా తప్పకుండా కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు కొన్ని సవరణలతో అమలు చేస్తున్నాయి.


మద్రాసు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మిగతా రాష్ట్రాల కోర్టులు కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వనున్నాయా అనే చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా మద్రాసు హైకోర్టు తీర్పుపై చర్చించుకుంటున్నారు.

Updated Date - 2020-05-09T20:58:24+05:30 IST