టైల్స్ ప్లాంట్లలో వార్మోరా గ్రానిటో రూ. 300 కోట్ల పెట్టుబడి
ABN , First Publish Date - 2020-10-29T01:11:56+05:30 IST
టైల్స్ ప్లాంట్లలో వార్మోరా గ్రానిటో రూ. 300 కోట్ల పెట్టుబడి

గాంధీనగర్: ప్రముఖ టైల్ మరియు బాత్వేర్బ్రాండ్ వార్మోరా గ్రానిటో ప్రైవేట్ లిమిటెడ్ రెండు అత్యాధునిక హైటెక్ ప్లాంట్లను గుజరాత్లోని మోర్బీ వద్ద ఏర్పాటు చేసింది. జీవీటీ టైల్స్ విభాగపు ప్లాంట్లలో రూ. 300 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.
ఈ ప్లాంట్లు ఏప్రిల్ 2021 నాటికి వాణిజ్య కార్యక్రమాలను ఆరంభించడంతో పాటు, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 1200 మందికి ఉపాధిని కల్పించనుంది. 2–3 సంవత్సరాలలో 1600 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్లోని గాంధీనగర్లో వర్ట్యువల్ ద్వారా ఈ ప్లాంట్లకు భూమి పూజ కార్యక్రమాలను గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్భాయ్ రూపానీ చేశారు.