కర్ణాటకలో ముగ్గురు పూజారులు హత్య
ABN , First Publish Date - 2020-09-12T07:56:38+05:30 IST
కర్ణాటకలో ముగ్గురు ఆలయ పూజారులను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు.

బెంగళూరు, సెప్టెంబరు 11: కర్ణాటకలో ముగ్గురు ఆలయ పూజారులను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు. మాండ్యాలోని అరకేశ్వరాలయం లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ పనిచేస్తున్న గణేష్, ప్రకాశ్, ఆనంద్ అనే ముగ్గురు పూజారులు ఆలయ ప్రాంగణంలోనే నివసిస్తున్నారు. హుండీలోని సొమ్మును ఎత్తుకెళ్లేందుకు గురువారం అర్ధరాత్రి దాటాక ఆలయంలోకి దొంగల ముఠా ప్రవేశించింది. అలికిడికి పూజారులు నిద్రలేవడం తో వారిని దొంగలు పదునైన కత్తులతో పొడిచి చంపారు. అనంతరం హుం డీలోని సొమ్మును ఎత్తుకుపోయారు.