పాక్ మోర్టార్ల దాడిలో ముగ్గురు భారత జవాన్ల మృతి
ABN , First Publish Date - 2020-11-28T07:57:53+05:30 IST
పాకిస్థాన్ సైనికులు మోర్టార్లతో దాడులు చేయడంతో ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని సుందర్బనీ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు, పూంచ్ జిల్లాలో మరో జవాను మృతి చెందారని
జమ్ము, నవంబరు 27: పాకిస్థాన్ సైనికులు మోర్టార్లతో దాడులు చేయడంతో ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని సుందర్బనీ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు, పూంచ్ జిల్లాలో మరో జవాను మృతి చెందారని అధికారులు తెలిపారు. పాక్ సైనికులు కాల్పులు జరుపుతూ, మోర్టార్ల వర్షం కురిపించడంతో శుక్రవారం నాయక్ ప్రేమ్ బహదూర్ ఖత్రి, సుఖ్బిర్ సింగ్ ప్రాణాలు కోల్పోయారని వివరించారు. గురువారం రాత్రి పూంచ్ జిల్లాలో పాక్ జరిపిన కాల్పుల్లో మరో ఆర్మీ అధికారి మృతి చెందారని వివరించారు.