బీహార్లో నేడు చివరి దశ పోలింగ్...78 స్థానాలలో ఓటింగ్!
ABN , First Publish Date - 2020-11-07T11:58:34+05:30 IST
బీహార్కు ఈరోజు(నవంబరు7) ఎంతో కీలకం కానుంది. 15 జిల్లాలలోని 78 సీట్లకు....
![బీహార్లో నేడు చివరి దశ పోలింగ్...78 స్థానాలలో ఓటింగ్!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020110706034850/11072020062824n39.jpg)
పట్నా: బీహార్కు ఈరోజు(నవంబరు7) ఎంతో కీలకం కానుంది. 15 జిల్లాలలోని 78 సీట్లకు ఈరోజు పోలింగ్ జరగనుంది. నేడు జరిగే మూడవ దశ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు ప్రచార హోరుతో తమ శక్తియుక్తులు చూపించాయి. ఈ రోజు పోలింగ్ జరిగే 78 స్థానాల్లో 63 జనరల్ కాగా, 13 రిజర్వ్డ్ సీట్లు.
మూడవ దశ ఎన్నికల్లో మొత్తం 1,204 మంది తమ భవిష్యత్ తేల్చుకోనున్నారు. ఈ 78 సీట్లలో 2015లో జేడీయే 23 స్థానాలను గెలుచుకోగా, ఆర్జేడీ 20 సీట్లు, బీజేపీ 20 సీట్లు చొప్పున గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 11 స్థానాలు దక్కించుకుంది. 2015 ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈసారి ఎన్నికల్లో సీఎం నితీష్కు ఆర్జేడీ, కాంగ్రెస్లతో పాటు చిరాగ్ పాశ్వాన్లతో పోటీ ఎదురుకానుంది. ఫలితంగా 2015 కన్నా ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో నితీష్కు గట్టిపోటీ ఉండనుంది.