సొరంగాల ద్వారా దేశంలోకి ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2020-09-14T08:21:56+05:30 IST

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో సొరంగ మార్గాలను తవ్వి భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు. అంతేకాక

సొరంగాల ద్వారా దేశంలోకి ఉగ్రవాదులు

పాకిస్థాన్‌ కొత్త ఎత్తుగడ


జమ్ము, సెప్టెంబరు 13: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో సొరంగ మార్గాలను తవ్వి భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు.

అంతేకాక.. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదులకు ఆయుధాలు అందించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే పాక్‌ కుటిల యత్నాన్ని తాము తిప్పికొడుతున్నామని వెల్లడించారు. ఇటీవల సాంబా జిల్లాలోని గాలార్‌ గ్రామంలో 170 మీటర్ల సొరంగ మార్గాన్ని కనుగొన్నామని ఆదివారం మీడియాకు ఆయన తెలిపారు.

Updated Date - 2020-09-14T08:21:56+05:30 IST