లద్దాఖ్లో పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు!
ABN , First Publish Date - 2020-05-24T08:16:44+05:30 IST
భారత-చైనా సరిహద్దున లద్దాఖ్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ గుండా పాంగాంగ్ సో లేక్, గాల్వన్ లోయ చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా తన సైనిక బలగాల మోహరింపును గణనీయంగా...
న్యూఢిల్లీ, మే 23: భారత-చైనా సరిహద్దున లద్దాఖ్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ గుండా పాంగాంగ్ సో లేక్, గాల్వన్ లోయ చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా తన సైనిక బలగాల మోహరింపును గణనీయంగా పెంచింది. ఇప్పట్లో తాము వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు పంపిస్తూ భారత సైన్యానికి చైనా గట్టి సవాలు విసురుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు నుంచి సమాచారం అందింది. గాల్వన్ లోయ వద్ద చైనా సైనిక దళాలు గత 15 రోజుల్లో సుమారు 100 టెంట్లను వేసినట్లు తెలిసింది. అక్కడ బంకర్లను తవ్వేందుకు యంత్రసామగ్రిని కూడా తరలించింది. అయితే పాంగాంగ్ సో లేక్, గాల్వన్ లోయ వద్ద చైనాకు దీటుగా భారత్ తన సైనిక దళాలను మోహరించిందని మిలటరీ వర్గాలు తెలిపాయి. ఇలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో సైనికదళాధిపతి జనరల్ ఎంఎం నరవాణే శుక్రవారం ‘లే’ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ భద్రతా పరిస్థితిపై కమాండర్లతో చర్చించారు.