మహిళను రైలు కింద తోసేశాడు
ABN , First Publish Date - 2020-11-23T07:09:43+05:30 IST
కదులుతున్న రైలు కిం ద మహిళను తోసినందుకు అమెరికాలో తెలుగు వ్యక్తి ని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఆ మహిళ రైలు పట్టాల మధ్యలో పడిపోవడంతో ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు...
- అమెరికాలో తెలుగు వ్యక్తి అరెస్టు
న్యూయార్క్, నవంబరు 22: కదులుతున్న రైలు కిం ద మహిళను తోసినందుకు అమెరికాలో తెలుగు వ్యక్తి ని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఆ మహిళ రైలు పట్టాల మధ్యలో పడిపోవడంతో ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. రైలు ఆమె పైనుంచి వెళ్లింది. నిందితుడిని ఆదిత్య వేములపాటి(24)గా గుర్తించారు. న్యూయార్క్ రాష్ట్రం మాన్హటన్ నగరంలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదిత్యపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డిసెంబరు 4 వరకు కోర్టు అతడికి రిమాండ్ విధించింది.