టాప్ లో తెలంగాణ.. ఏపీ ఎక్కడంటే...

ABN , First Publish Date - 2020-08-20T23:34:02+05:30 IST

ఇంటింటికి నల్లా కలెక్షన్ల ద్వారా మంచి నీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మిషన్ భగీరధ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం మంచి నీటి సరఫరా జరిగేలా చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో... తెలంగాణలో 98.31 శాతం ఇళ్ళకు మంచి నీటి నల్లా కనెక్షన్లు ఉన్నట్టు వెల్లడైంది.

టాప్ లో తెలంగాణ.. ఏపీ ఎక్కడంటే...

న్యూఢిల్లీ : ఇంటింటికి నల్లా కలెక్షన్ల ద్వారా మంచి నీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మిషన్ భగీరధ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం మంచి నీటి సరఫరా జరిగేలా చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో... తెలంగాణలో 98.31 శాతం ఇళ్ళకు మంచి నీటి నల్లా కనెక్షన్లు ఉన్నట్టు వెల్లడైంది.


తెలంగాణ రాష్ట్రం 98.31 శాతం ఇళ్ళకు నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర జల‌శక్తి మంత్రిత్వశాఖ జల్‌ జీవన్‌ మిషన్‌ వివరాలను ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 54.38 లక్షల ఇళ్లుండగా వాటిల్లో 53.46 లక్షల ఇళ్లకు తాగునీరు అందుతోంది.


తెలంగాణ తరువాత 89.05 శాతంతో గోవా రాష్ట్రం రెండో స్థానంలో నిలవగా, 87.02 శాతంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరి మూడో స్థానంలో నిలిచింది. నల్లా కలెక్షన్లలో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో నిలిస్తే, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రం బాగా వెనకపడిపోయింది. ఈ జాబితాలో కేవలం 34.62 శాతంతో ఏపీ 13 వ స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇక 2.05 శాతంతో పశ్చిమ బెంగాల్, 1.86 శాతంతో మేఘాలయ చివరి స్థానాల్లో నిలిచాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశారు.


"కేంద్ర జల శక్తి నివేదిక మేరకు... తెలంగాణ 98.31 శాతం నల్లాల కనెక్షన్లతో తాగునీరు అందిస్తూ తొలిస్థానంలో నిలిచింది. మిషన్ భగీరథ ద్వారా ఈ తాగునీరు అందుతోంది. ఈ అద్భుత విజయానికి కారణమైన సీఎం కేసీఆర్ దూరదృష్టికి, కష్టపడి పనిచేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ టీమ్‌కు అభినందనలు" అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-20T23:34:02+05:30 IST