కేసీఆర్ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-12-31T03:51:58+05:30 IST

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు.

కేసీఆర్ సంచలన నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీతో పాటు ఆయుష్మాన్ భారత్‌ పథకాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తమ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో సోమేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు.


బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కావడంతో కేసీఆర్ ఇంతకాలం వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే తన నిర్ణయాన్ని అనూహ్యంగా మార్చుకున్నారు. ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకం కావడంతో తన వైఖరి మార్చుకున్నారు. కేసీఆర్ నిన్ననే నియంత్రిత సాగు విధానానికి వీడ్కోలు పలికారు. ఎల్ ఆర్ ఎస్‌ను ఎత్తివేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని కూడా నిర్ణయించారు.   

Updated Date - 2020-12-31T03:51:58+05:30 IST