పైలట్ వర్గీయులు ఏ రిసార్టుల్లో ఉన్నారు? గోప్యంగా ఉంచుతున్న పైలట్

ABN , First Publish Date - 2020-07-19T14:06:02+05:30 IST

సచిన్ పైలట్ నేతృత్వంలోని 18 ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఏ రిసార్టుల్లో ఉన్నారు? అన్నది ప్రస్తుతం

పైలట్ వర్గీయులు ఏ రిసార్టుల్లో ఉన్నారు? గోప్యంగా ఉంచుతున్న పైలట్

న్యూఢిల్లీ : సచిన్ పైలట్ నేతృత్వంలోని 18 ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఏ రిసార్టుల్లో ఉన్నారు? అన్నది ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. రాజకీయం ఇంత రంజుగా ఉన్నా... తమ ఆచూకీని మాత్రం పైలట్ అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. హర్యానా రిసార్టుల్లో ఉన్నారంటూ రాజస్థాన్ పోలీసులు రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లగా... ఆ రిసార్టుల్లో లేరని తెలుసుకొని రిక్త హస్తాలతో తిరుగు పయనమయ్యారు. ఆ తర్వాత బెంగళూరుకు పయనమవుతున్నారని పుకార్లు ఒక్క సారిగా గుప్పు మన్నాయి.


అయితే ఆ వర్గంలోని ఓ ఎమ్మెల్యే ఈ వార్తను ఖండించారు. ఓ జాతీయ ఛానల్ ఆయన్ను ప్రశ్నించగా.... ‘‘బెంగళూరుకు తాము వెళ్లే ఛాన్సే లేదు. మేము ప్రస్తుతం ఎక్కడున్నామన్నది మేము మాత్రం వెల్లడించం’’ అని స్పష్టం చేశారు. అయితే రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్’ కు చెందిన ఉన్నతాధికారులు మాత్రం పైలట్ వర్గీయులు ఢిల్లీలోనే మకాం వేసినట్లు నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. 

Updated Date - 2020-07-19T14:06:02+05:30 IST