ముంబైకు కేరళ డాక్టర్లు, నర్సుల బృందం
ABN , First Publish Date - 2020-06-01T14:06:50+05:30 IST
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో హాట్ స్పాట్ అయిన ముంబై నగరానికి కేరళ రాష్ట్రానికి చెందిన వందమంది వైద్యులు, నర్సుల బృందాన్ని పంపిస్తున్నట్లు....
తిరువనంతపురం (కేరళ): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో హాట్ స్పాట్ అయిన ముంబై నగరానికి కేరళ రాష్ట్రానికి చెందిన వందమంది వైద్యులు, నర్సుల బృందాన్ని పంపించినట్లు కేరళ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి థామస్ ఇసాక్ చెప్పారు. తిరువనంతపురం టీవీవీ మెడికల్ కళాశాల డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్ నేతృత్వంలో వైద్యబృందాన్ని ముంబై నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి పంపించామని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర సర్కారు చేసిన వినతిపై తాము వైద్య బృందాన్ని పంపించామని మంత్రి చెప్పారు. మహారాష్ట్రలో 65,168 మందికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో వారికి వైద్యసేవలు అందించేందుకు కేరళ వైద్యబృందాన్ని పంపించామని మంత్రి వివరించారు.