తమిళనాడులో మళ్లీ 2000కు పైగా కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-06-19T01:00:15+05:30 IST
తమిళనాడులో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదయ్యాయి. ఈ రోజు ఏకంగా 2000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కేసులు...

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదయ్యాయి. ఈ రోజు ఏకంగా 2000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ ఒక్కసారిగా పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 2,141 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,017మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52,334కి చేరింది. వీరిలో 23,065మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 28,641 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 625 మంది ప్రాణాలు కోల్పోయారు.