తమిళనాడులో వరుసగా రెండో రోజు కూడా దారుణంగా బయటపడిన కేసులు
ABN , First Publish Date - 2020-07-20T00:31:39+05:30 IST
తమిళనాడులో వరుసగా రెండోరోజు కూడా 4వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. గత 35 గంటల్లో ఏకంగా 4,979 కరోనా

చెన్నై: తమిళనాడులో వరుసగా రెండోరోజు కూడా 4వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. గత 35 గంటల్లో ఏకంగా 4,979 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.7 లక్షల మార్కు దాటేసి 1,70,693కు పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 50,294 యాక్టివ్గా ఉన్నట్టు పేర్కొంది. శనివారం కొత్తగా 78 మంది కరోనా బారినపడి మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 2,481కి పెరిగింది. తాజాగా, 4,059 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,17,915కు పెరిగినట్టు అధికారులు తెలిపారు. నేడు కొత్తగా 52,993 శాంపిళ్లను పరీక్షించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 19 లక్షలు దాటింది. రాష్ట్రంలో ప్రస్తుతం 112 కరోనా టెస్టింగ్ కేంద్రాలు ఉండగా, వీటిలో 55 ప్రైవేటు కేంద్రాలని వివరించింది.