కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-08-20T14:06:06+05:30 IST

కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలు ప్రారంభం

కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలు ప్రారంభం

చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తి గా తగ్గిన తర్వాతే పాఠశాలలు ప్రారంభిస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి కేఏ సెంగోటయ్యన్‌ స్పష్టం చేశారు. దేశవ్యాప్తం గా కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మార్చి 24వ తేది నుంచి విద్యాసంస్థలు మూత పడ్డా యి. కరోనా విజృంభిస్తున్న కారణంగా లాక్‌డౌన్‌ ఈ నెలఖరు వరకు కేంద్రప్రభుత్వం పొడిగించింది. ఈ నేపథ్యంలో, కరోనా తీవ్రత పరిగణలోకి తీసుకొని పాఠశాలలు, కళాశాలలు ప్రారం భించవచ్చని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం సూచిం చింది. రాష్ట్రంలో పాఠ శాలల ప్రారంభంపై మంత్రి సెంగోట్టయన్‌ బుధవారం విద్యాశాఖ అధికారులతో చర్చించారు. అనం తరం ఆయన మీడియాతో మాట్లా డుతూ, రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. ఉపాఽ ద్యాయ అర్హత పరీక్షల్లో ప్రస్తుత నిబంధ నలు కొనసాగుతాయని, వాటిలో ఎలాంటి మార్పులు లేవని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-08-20T14:06:06+05:30 IST