ఆస్తి తగాదాలతో తల్లీచెల్లెళ్ల హత్య
ABN , First Publish Date - 2020-06-11T16:15:53+05:30 IST
ఆస్తి తగాదాలతో తల్లీచెల్లెళ్ల హత్య

చెన్నై: ఆస్తి తగాదాల కారణంగా ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. జిల్లాలోని గుడియాత్తం సమీపంలోని పరదరామి పూజారి వలసైకన్నన్పట్టికి చెందిన రైతు మాణిక్యం, ఇంద్రాణి (70) దంప తులకు మునిరాజ్, చిన్నమ్మ(35), సూర్యకళ(30) అనే కుమార్తెలున్నారు. మునిరాజ్, సూర్యకళకు వివాహం కావడంతో వారు అదే ప్రాంతంలో వేరుగా ఉంటున్నారు. చిన్నమ్మకు వివాహం కాక తల్లితో కలసి జీవిస్తోంది. కొద్దికా లం కిత్రం మాణిక్యం మరణించడంతో, తండ్రికి చెందిన పదెకరాల పొలం తల్లి ఇంద్రాణి పేరిట ఉంది. ఆ పొలాన్ని తనకివ్వాలని మునిరాజ్ పలు మార్లు తల్లితో ఘర్షణ పడుతుండేవాడు. బుధవారం ఉదయం మళ్లీ పొలం పంపకాలపై మునిరాజ్ తల్లిలో గొడవపడ్డాడు. పొలం ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆగ్రహించిన మునిజార్ కర్ర, రాళ్లతో తల్లి, సోదరిపై దాడి చేశాడు. చుట్టుపక్కల వారు తీవ్రంగా గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ మృతి చెందారు. ఈ ఘటనపై గుడియాత్తం పోలీసులు కేసు నమోదుచేసి మునిరాజ్ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.