నవ వధువు దారుణహత్య
ABN , First Publish Date - 2020-08-10T17:53:23+05:30 IST
నవ వధువు దారుణహత్య
చెన్నై: విరుదునగర్ జిల్లాలో వివాహమై ఒకటిన్నర నెల అయిన నవ వధువు హత్యకు గురైంది. తిరుత్తంగళ్-అల్మరాత్తుపట్టి సమీపం పెరియార్కాలనీకి చెందిన సెల్లపాండియన్ (26)కు తిరుమంగళం సత్యనగర్కు చెందిన ప్రగతి మోనిక (24)కు నెలన్నర క్రితం వివాహమైంది. సెల్లపాండి యన్ అదే ప్రాంతంలోని అగ్గిపెట్టెల తయారీ కేంద్రంలో పనిచేస్తుండగా, డిగ్రీ పూర్తి చేసిన ప్రగతి మోనిక ఇంట్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో, శనివారం ఉదయం సెల్లపాండియన్ యధావిధిగా విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఓసారి ప్రగతి భర్తతో సెల్ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. కొద్దిసేపటి తరువాత పక్కింటి మహిళ సెల్లపాండియన్ ఇంట్లోకి వెళ్లగా గొంతు కోసి రక్తపు మడుగులో పడివున్న ప్రగతిని చూసి దిగ్ర్భాంతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న సెల్లపాండిన్ శివకాశి సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్గం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నగలు, నగదు కోసం ఈ హత్య జరిగిందా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా, వివాహమై నెలరోజులే కావడంతో ఆర్డీఓ విచారణ చేపట్టణ చేపడతారని అధికారులు పేర్కొన్నారు.