మృతదేహం వెలికితీత

ABN , First Publish Date - 2020-05-24T15:26:44+05:30 IST

మృతదేహం వెలికితీత

మృతదేహం వెలికితీత

చెన్నై: తన భర్త మృతిపై అనుమానం ఉందని బాగాయం పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల కథనం మేరకు.. స్థానిక పిళ్లయార్‌ గుడి వీధికి చెందిన పళని(43) మేస్త్రీ. ఆయన భార్య రాధ. అయితే ఈనెల మూడో తేదీన ఇంట్లోనే పళని మృతి చెందారు. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు అదే ప్రాంతంలోని శ్మశానవాటికలో ఖననం చేశారు. కాగా గతనెల 29న వెట్రివేల్‌, పట్టాభిరామన్‌, అతని స్నేహితులు పళనిని కూలీ పనులకు తీసుకెళ్లిన కొద్ది గంటల్లోనే తన భర్త గాయాలతో ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకుంటూ మృతి చెందాడని బాగాయం పోలీసులకు పళని భార్య రాధ  ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌ రమేష్‌ నేతృత్వంలో పోలీసులు శనివారం ఉదయం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పళని స్నేహితులు పట్టాభి, వెట్రివేల్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-05-24T15:26:44+05:30 IST