తేజస్కు కరోనా బ్రేకులు... కాశీ- మహాకాళ్ ఎక్స్ప్రెస్ రద్దు
ABN , First Publish Date - 2020-03-19T11:35:16+05:30 IST
కరోనా వైరస్ భారతీయ రైల్వేలను కూడా దెబ్బతీస్తోంది. కరోనా భయాల నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు - తేజస్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు.
![తేజస్కు కరోనా బ్రేకులు... కాశీ- మహాకాళ్ ఎక్స్ప్రెస్ రద్దు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020031906002982/03192020060505n28.jpg)
న్యూఢిల్లీ: కరోనా వైరస్ భారతీయ రైల్వేలను కూడా దెబ్బతీస్తోంది. కరోనా భయాల నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు - తేజస్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. పర్యాటక మంత్రిత్వశాఖ సూచనల మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సిటిసి) ఈ నిర్ణయం తీసుకుంది. లక్నో- ఢిల్లీ, అహ్మదాబాద్- ముంబై మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లను మార్చి 31 వరకు రద్దు చేయనున్నట్లు ఐఆర్సిటిసి తెలిపింది. ఇవే కాకుండా వారణాసి- ఇండోర్ మధ్య ఇటీవలే ప్రారంభమైన కొత్త రైలు - కాశీ-మహాకాళ్ ఎక్స్ప్రెస్ను కూడా ఏప్రిల్ 1 వరకు రద్దు చేశారు. అయితే ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి టిక్కెట్లు తీసుకున్న ప్రయాణీకులకు వారి డబ్బు తిరిగి చెల్లిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ భయాల కారణంగా రైల్వేలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ మొత్తం 85 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లనన్నింటినీ ఏప్రిల్ 1 వరకు నిలిపివేయనున్నారు.