డ్రాగన్‌పై రామ బాణం

ABN , First Publish Date - 2020-06-18T07:10:30+05:30 IST

గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనా నుంచీ 43 మంది సైనికులు చనిపోయారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల ప్రజలు స్పందిస్తూ జాతీయతను...

డ్రాగన్‌పై రామ బాణం

తైపీ, జూన్‌ 17: గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనా నుంచీ 43 మంది సైనికులు చనిపోయారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల ప్రజలు స్పందిస్తూ జాతీయతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రాగన్‌పై రాముడు తన బాణాన్ని గురిపెట్టిన ఫొటోను ‘తైవాన్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌’ ప్రచురించింది. ‘చైనా డ్రాగన్‌ను రా ముడు ఎదుర్కొన్నాడు’ అంటూ శీర్షిక పెట్టి వ్యాసం రాసింది. ఈ గొడవలో 20 భారత సైనికులు అమరులయ్యారని, 43 మంది తమ సైనికులు కూడా చనిపోయి లేదా గాయపడి ఉండొచ్చని పీఎల్‌ఏ పేర్కొన్నట్లు ఆ వ్యాసంలో పేర్కొంది.


Updated Date - 2020-06-18T07:10:30+05:30 IST