22 వేలమంది తబ్లిగి కార్యకర్తలను క్వారంటైన్ చేశాం: కేంద్రం

ABN , First Publish Date - 2020-04-04T22:29:16+05:30 IST

దేశ వ్యాప్తంగా దాదాపు 22 వేల మందికి పైగా తబ్లిగి జమాత్ కార్యకర్తలు వారి సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కి ...

22 వేలమంది తబ్లిగి కార్యకర్తలను క్వారంటైన్ చేశాం: కేంద్రం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు 22 వేల మందికి పైగా తబ్లిగి జమాత్ కార్యకర్తలు వారి సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కి తరలించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 1,023 మంది (30 శాతం) తబ్లిగి జమాత్‌కి సంబంధించిన వారే ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఇవాళ మీడియాకు వెల్లడించారు. దాదాపు 17 రాష్ట్రాల్లో తబ్లిగి జమాత్ ప్రభావం పడినట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,902 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనీ.. ఇందులో గత 24 గంటల్లోనే 601 కొత్త కేసులు వెలుగుచూశాయన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో 68 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అగర్వాల్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-04T22:29:16+05:30 IST