విజయవాడ, విశాఖలకు చోటు దక్కడంపై వెంకయ్య హర్షం
ABN , First Publish Date - 2020-08-20T23:30:52+05:30 IST
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్ -2020 అవార్డుల్లో 10 లక్షల పైన జనాభా గల నగరాల జాబితాలో 4వ స్థానంలో విజయవాడ, 9వ స్థానంలో విశాఖ నిలవడం ఆనందదాయకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు.

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్ -2020 అవార్డుల్లో 10 లక్షల పైన జనాభా గల నగరాల జాబితాలో 4వ స్థానంలో విజయవాడ, 9వ స్థానంలో విశాఖ నిలవడం ఆనందదాయకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి ఆయన అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్ -2020 అవార్డుల్లో చీరాల పట్టణానికి కూడా అవార్డు దక్కింది.