నక్సల్ దంపతుల లొంగుబాటు
ABN , First Publish Date - 2020-06-07T08:32:53+05:30 IST
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్ దంపతు లు పోలీసులకు లొంగిపోయారు.
బీజాపూర్, జూన్ 6: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్ దంపతు లు పోలీసులకు లొంగిపోయారు. గోపి మొడియం(35), భారతి కట్టం(32) శనివారం లొంగిపోయారని బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజ్ చెప్పారు. గోపిపై 73 కేసులు నమోదయ్యాయని, అతనిపై రూ.5 లక్షల రివార్డు ఉందన్నారు. అలాగే, మిలటరీ ప్లటూన్-2కు చెందిన భారతి అనేక హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని చెప్పారు. ఆమెపై రూ.2 లక్షల రివార్డు ఉందన్నారు.