యువతి దగ్గిందని.. 26లక్షల విలువైన ఆహార పదార్థాలు పారేసిన సూపర్ మార్కెట్

ABN , First Publish Date - 2020-03-27T20:07:26+05:30 IST

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పేరు చెప్తేనే అన్ని దేశాలు గజగజలాడిపోతున్నాయి. ఈ వైరస్ ప్రజలను ...

యువతి దగ్గిందని.. 26లక్షల విలువైన ఆహార పదార్థాలు పారేసిన సూపర్ మార్కెట్

పెన్సిల్వేనియా: చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పేరు చెప్తేనే అన్ని దేశాలు గజగజలాడిపోతున్నాయి. ఈ వైరస్ ప్రజలను ఎంత భయపెడుతుందో తెలిసిందే. ఈ పరిస్థితికి అడ్డంపెట్టే ఓ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్ కు ఓ యువతి వచ్చింది. అక్కడ ఉన్న ఆహారపదార్థాలపై కావాలని దగ్గింది. దీన్ని గమనించిన సిబ్బంది.. సదరు యువతిని వెంటనే స్టోర్ నుంచి బయటకు పంపేశారు.


ఆ తర్వాత స్టోర్ లో ఆమె ఎక్కడెక్కడ తిరిగిందో అక్కడ శుభ్రంచేశారు. ఈ విషయం తెలుసుకున్న స్టోర్ యజమాని.. ఆ యువతి దగ్గిన ఆహారపదార్థాలు గుర్తించి వాటన్నింటినీ పారేశాడు. అంత ఆహారం పారేసినందుకు బాధగా ఉన్నా తపలేదని సూపర్ మార్కెట్ యాజమాన్యం చెప్పింది. ఆ యువతిని పట్టుకున్న అధికారులు, ఆమెకు కరోనా పరీక్షలు చేయించడానికి తీసుకెళ్లారు.

Updated Date - 2020-03-27T20:07:26+05:30 IST