రైతుల ఆందోళనకు విద్యార్థుల సంఘీభావం
ABN , First Publish Date - 2020-12-02T02:03:19+05:30 IST
వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులకు పలు యూనివర్సిటీలకు చెందిన...
న్యూఢిల్లీ: వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులకు పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని క్రాంతికారి యువ సంఘటన్ (కేవైఎస్) డిమాండ్ చేసింది. ఇలాంటి ‘‘ప్రజా వ్యతిరేక చట్టాలను’’ చేసినందుకుగానూ దేశ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని పేర్కొంది. ‘‘రైతులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావంగా మేము దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళన చేపట్టాం. ఈ చట్టాల కారణంగా వ్యవసాయ రంగంలోని రైతు కూలీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. నూతన వ్యవసాయ చట్టాల ద్వారా కార్పొరేట్ సంస్థలు, ధనిక రైతులకు లబ్ది చేకూర్చాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. చిన్నకారు రైతులు, రైతు కూలీలు ఈ చట్టాల కారణంగా నలిగిపోతారు.’’ అని కేవైఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది.